సైరా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో ఔరా అనిపించలేకపోయింది. అయినప్పటికీ దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మాత్రం
సైరా ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. భారీ హిస్టారికల్ మూవీని హ్యాండిల్ చేయడంలో
సురేందర్ రెడ్డి నూటికి నూరు శాతం
సక్సెస్ అయ్యాడు. అదే ఇప్పుడు హీరోలు, ఈ దర్శకుడితో సినిమాలు చేయాలనిపించేలా చేస్తోంది. ప్రస్తుతం ఐదుగురు హీరోలు సురేందర్ రెడ్డితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
అదే విధంగా
ఆర్ఆర్ఆర్ తర్వాత
రామ్ చరణ్ సైతం సురేందర్ పైనే గురి పెడుతున్నట్టు టాక్. ధృవ సినిమాతో సురేందర్ రెడ్డికి
చరణ్ కు మధ్య మంచి బాండింగ్ కుదిరింది. అందుకే ఏకంగా
సైరా లాంటి భారీ కాన్వాస్ ఉన్న ప్రాజెక్ట్ ని
సూరి చేతికి ఇచ్చాడు. ఈ క్రమంలోనే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నట్టు కనిపిస్తోంది. అదేవిధంగా
వరుణ్ తేజ్ తో సైతం
సురేందర్ రెడ్డి సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు వినిపిస్తోంది. మరి మెగా కాంపౌండ్ లోనే
సూరి మరో
సినిమా చేస్తాడా..?
ప్రిన్స్ కు కమిట్ అవుతాడా చూడాలి.!