టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ కూడా అనేక ట్రోలింగ్స్ కు గురయ్యే హీరో ఎవరన్నా ఉన్నారంటే అది మహేశ్ బాబు ఒక్కడే. మహేశ్ కు క్రేజ్ ఉన్నా, అతని సినిమాల ఓపెనింగ్స్ బాగున్నా.. కూడా ట్రోలింగ్స్ గురవుతున్నాడంటే కారణం ఒక్కటే.. క్యారెక్టర్లు, మేకోవర్లపై శ్రద్ధ పెట్టకపోవడమే. గత అయిదు సినిమాల ఫస్ట్ లుక్ పిక్స్ పై సోషల్ మీడియాపై వచ్చిన ట్రోలింగ్స్ చాలా ఎక్కువ. ‘స్టిల్ ఒక్కటే.. డ్రెస్ మాత్రం మారుతూంటుంది’ అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. మహేశ్ ఈ కామెంట్లను సీరియస్ గా తీసుకున్నాడని సమాచారం.

 


ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయ్యాక మహేశ్ దాదాపు మూడు నుంచి అయిదు నెలలపాటు గ్యాప్ తీసుకోనున్నాడనే వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత మహేశ్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్ చల్ అవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా సబ్జెక్ట్ గా తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సమాచారం. ఈ సినిమాకు ఎలాగైనా తన మేకోవర్ మార్చి కొత్తగా కనిపించేందుకే ఈ గ్యాప్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇండియా వైడ్ గా విడుదల చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ రెగ్యులర్ గెటప్ వర్కౌట్ కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 


సినిమా ఫస్ట్ లుక్ లో ఆర్మీ ఆఫీసర్ లుక్ లో ఏమాత్రం వేరియేషన్ లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చాయో అంతకుమించి దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన లుక్ పై మరిన్ని విమర్శలు వచ్చాయి. దీంతో.. కథానుసారంగా కొత్త లుక్ లోకి మారేందుకే ఈ గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ వార్త అభిమానులకు సంతోషమే అయినా ఈ వార్తలపై మహేశ్ మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: