సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. డైరక్టర్ అనీల్ రావిపుడి హిట్ మేనియా చూస్తే మహేష్ సినిమా కూడా పక్కా హిట్టు కొట్టడం కన్ఫాం అని తెలుస్తుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే సంక్రాంతికి ఈ సినిమాకు పోటీగా వస్తున్న అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. రిలీజైన రెండు సాంగ్స్ మరో ప్రమో సాంగ్ కూడా హిట్ అయ్యింది.


అయితే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి ఇప్పటివరకు ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. ఇండిపెండెన్స్ డే నాడు వీర జవాన్ల కోసం ఓ సాంగ్ వదిలారు. అయితే మహేష్ ఈ సినిమాపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉందని తెలుస్తుంది. పక్కా కమర్షియల్ హిట్టు కొట్టే అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్, రష్మిక జోడీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట.


మహేష్ ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ మీద దృష్టి పెట్టాడు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ కు పక్కా హిట్టు ఇస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. వరుస హిట్లతో ఫాం లో ఉన్న మహేష్, యూత్ లో భారీ క్రేజ్ ఉన్న రష్మిక, డైరక్టర్ గా సూపర్ స్వింగ్ లో ఉన్న అనీల్ రావిపుడి ఈ హిట్ కాంబో ఎలాంటి హిట్ సినిమా ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: