తమిళ హీరో కార్తీ ఖైదీ సినిమా సక్సెస్ ఎంజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుందని అసలు కార్తీ కూడా ఊహించలేదని తెలుసు. ఇకపోతే సూర్య కన్నా కూడా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కార్తీ బాగా ఫెమస్ అయ్యాడు. కోలీవుడ్ సినీ దర్శకులు కార్తీ నెక్స్ట్ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా  అని అందరు ఎదురుచూస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే ఇంకా అన్ని పక్క అని అర్థమవుతుంది. 


చిరంజీవి టైటిల్ ను పెట్టుకున్న కార్తీ ఇప్పుడు వందకోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇప్పుడు ఆరో సినిమాలో నటించడానికి సముఖత చూపిస్తున్నాడు. అయితే, ఆ సినిమా హిట్ అవ్వడంతో ఏ దర్శకుడి కార్తీ ఓకే చెప్తాడాఆ అని సినీ ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. అయితే ఈ సారి కూడా కార్తీ చిరంజీవి ని  వదలడని అర్థమవుతుంది. మరో సారి కూడా మిస్టర్ చిరంజీవిని వదిలే సమస్య లేదని అంటున్నారు. 


ఇది ఇలా ఉండగా కార్తీ చిరంజీవి నటించిన మరో సినిమా టైటిల్ ను వాడుకున్నాడు. అయితే, ఆ సినిమా కంటే ముందు కార్తి హీరోగా ఇంకో చిత్రం వస్తోంది. కార్తి, ఆయన వదిన జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో ఒక చిత్ర తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తమిళంలో ‘తంబి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.తెలుగులో ‘దొంగ’గా రాబోతోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో సూర్య శుక్రవారం విడుదల చేశారు.


దొంగ’ సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సమర్పణలో ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖైదీ హిట్.. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: