ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన హాలీవుడ్ యానిమేటేడ్ మూవీ ఫ్రోజెన్ అద్బుతమైన విజయాన్ని అందుకుని ఎంతో క్రేజ్ సంపాదించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఫ్రోజెన్ 2 తెరకెక్కింది. క్రిస్ బక్, జెన్నిఫర్ లీ దర్శకులుగా వాల్ట్ డిస్నీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా తెలుగు వర్షన్ కు సినిమాలో ముఖ్య పాత్ర అయిన ఎల్సా పాత్రకు ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ వాయిస్ ఓవర్  ఇస్తుండగా, ఆ పాత్ర చిన్నప్పటి క్యారెక్టర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ ఘట్టమనేని సితార తన వాయిస్ ని అందించడం జరిగింది. 

కాసేపటి క్రితం హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ సినిమా డిస్నీ ఇండియా ప్రతినిధులతో పాటు హీరోయిన్ నిత్యామీనన్, నమ్రత మహేష్, సితార సహా మరికొందరు సినిమా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, తనకు ఫ్రోజెన్ సినిమా అంటే ఎంతో ఇష్టం అని, తొలి భాగం మాదిరిగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని నిత్యా మీనన్ అన్నారు. ఇక సితార మాట్లాడుతూ, 

మొదట ఈ సినిమాలో ఎల్సా చిన్నప్పటి క్యారెక్టర్ కు తాను వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయాన్ని తన తండ్రి మహేష్ కు చెప్పగానే, ఆయన ఎంతో ఆశ్చర్యపోయారని, ఫస్ట్ టైం మంచి అవకాశం దక్కించుకున్నావు, బాగా ప్రాక్టీస్ చేయి అని అన్నారని సితార చెప్పుకొచ్చింది. వీలైతే తండ్రి మహేష్ తో కలిసి ఈ సినిమా తెలుగు వర్షన్ ను తప్పకుండా చూస్తానని సితార చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా తెలుగు ట్రైలర్, అదరగొట్టే వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.1 గంట 43 నిమిషాల వ్యవధి గల ఈ సినిమా, ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో భారీ రేంజ్ లో రిలీజ్ కానుంది. మరి ఫస్ట్ సినిమాతో సితార ఎంతవరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: