కోలీవుడ్ యంగ్ క్రేజీ
హీరో విశాల్ హీరోగా మిల్కిబ్యూటీ తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్లుగా సుందర్ .సి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం యాక్షన్. యాక్షన్ టైటిల్తోనే ఆసక్తి రేపిన ఈ
సినిమా రిలీజ్కు ముందే హై ప్రి రిలీజ్ బజ్ తెచ్చుకుంది. టీజర్లు, ట్రైలర్లు దుమ్ము రేపడంతో పాటు
విశాల్ కెరీర్లోనే రు.60 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన
సినిమా అంటూ ప్రచారం జరగడంతో యాక్షన్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
కథాకథనాలు వీక్ గా ఉన్నప్పటికీ ఈ సినిమాను రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ కలిసి నిలబెట్టేశాయి. హిపాప్ తమిజా రీ రికార్డింగ్ .. డుడ్లీ ఫొటోగ్రఫీ ప్రధానమైన బలంగా నిలిచాయి. టెన్షన్ బిల్డప్ చేయడంలో రీ రికార్డింగ్ మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇస్తాంబుల్ ..
పాకిస్థాన్ ..
లండన్ లొకేషన్స్ లోని ఛేజింగ్ సీన్స్ ను డుడ్లీ తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. పాటల్లోను విదేశాల్లోని లొకేషన్లను చాలా అందంగా చూపించాడు.
ఇక ఈ శుక్రవారం అటు తమిళ్తో పాటు ఇటు తెలుగులో ఒకేసారి ఈ
సినిమా రిలీజ్ అయ్యింది. శుక్రవారం మరో యంగ్
హీరో సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణుడు బీఏబీఎల్ సినిమాతో పాటు విజయ్ సేతుపతి
సినిమా కూడా యాక్షన్కు పోటీగా రిలీజ్ అయ్యాయి. తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 75 లక్షలకు పైగా షేర్ రాబట్టింది. అయితే ఈ
సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ రు.8 కోట్లకు అమ్మారు.
సినిమాకు జరిగిన బిజినెస్తో కంపేరిజన్ చేసి చూస్తే ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు తక్కువే అని చెప్పాలి. మరి ఫస్ట్ వీకెండ్తో పాటు లాంగ్ రన్లో యాక్షన్ మరింతగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది.