ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో అదరగొట్టడంతో, తప్పకుండా సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీకి తండ్రి గా మురళి శర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో నెగటివ్ ప్రచారం కూడా జరుగుతోంది. అదేమిటంటే, 

ఈ సినిమాలోని కథ మరియు కథనాలు గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మాదిరిగా సాగుతాయని, అయితే అప్పట్లో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే దక్కించుకున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఇక ఈ అలవైకుంఠపురములో సినిమా కూడా అదే విధంగా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో సాగుతుందని, కాబట్టి మరొక్కసారి మళ్ళి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎక్కువగా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకునే అవకాశాలు కూడా కనపడుతున్నట్లు చెప్తున్నారు. 

అది మాత్రమే కాక ఈ సినిమా కథ పరంగా కూడా పెద్దగా కొత్తదనం ఉండదని, కాకపోతే త్రివిక్రమ్ మార్క్ పంచెస్ మాత్రం సినిమాలో బాగా పేలుతాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలపై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, ఇటువంటివి అన్నీ కూడా కేవలం ఒట్టి పుకార్లేనేని, పైగా సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో, ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా అలవైకుంఠపురములో సినిమా ఈ విధమైన కథతో సాగుతుందో లేదో తెలియాలంటే మాత్రం  2020 జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: