టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చివరిదశ షూటింగ్ కి చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే మహేష్ బాబు తన కెరీర్ లో వదిలేసుకున్న మూడు సినిమాలు, ఇతర హీరోల పాలిట కల్పవృక్షాలుగా మారి వారి కెరీర్ కి బంగారు బాటలు వేసాయి. వాటిలో ముందుగా నాగచైతన్య మరియు సమంతల కలయికలో వచ్చిన ఏ మాయ చేసావే గురించి చెప్పాలి. నిజానికి ఈ సినిమా కథను దర్శకుడు గౌతమ్ మీనన్, మహేష్ కోసం సిద్ధం చేసారు, అయితే మహేష్ కూడా ఈ సినిమా చేస్తారు అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా మహేష్ బాబు తప్పుకుని ఆయన స్థానంలో నాగచైతన్య హీరోగా నటించడం జరిగింది. 

మహేష్ సోదరి మంజుల తన ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ద్వారా మహేష్ బావైన సుధీర్ బాబు టాలీవుడ్ కి నటుడిగా పరిచయం అయ్యారు. అప్పట్లో ఈ సినిమా యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సూపర్ హిట్ అందుకుంది. ఇక దీని తరువాత తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన హిట్ మూవీ 24 కూడా మహేష్ కోసం సిద్ధం చేసిన కథే. ఒకానొక సమయంలో దర్శకుడు విక్రమ్ కుమార్, మహేష్ గారికి ఈ 24 మూవీ కథ చెప్పానని, అయితే ఆ సినిమా కథ ఎంతో బాగుందన్న మహేష్ గారు, ఇటువంటి ప్రయోగాత్మక సినిమాలకు తమిళ నటుడు సూర్య అయితే సరిపోతాడని ఆయనను వెళ్లి కలవమని సూచించారట. ఆ విధంగా ఆ సినిమా అప్పట్లో సూర్య చేయడం, తమిళ్ లో అది సూపర్ హిట్ కొట్టడం జరిగింది. ఇక తెలుగులో కూడా ఆ సినిమా బాగానే కలెక్షన్ రాబట్టడం జరిగింది. ఇక దాని తరువాత సూర్య తమ్ముడు కార్తీ హీరోగా లింగుసామి దర్శకత్వంలో వచ్చిన ఆవారా సినిమా కూడా మహేష్ చేజార్చుకున్నదే. 

కెరీర్ పరంగా అంతకముందు యుగానికి ఒక్కడు సినిమా చేసిన కార్తీ, రెండవ సినిమాగా వచ్చిన ఆవారాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా కథను మొదటగా దర్శకుడు లింగుసామి మహేష్ ని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగిందట. మహేష్ కు వీరాభిమాని అయిన లింగుసామి, అప్పట్లో మహేష్ గారి కోసం ఒక మంచి కథ సిద్ధం చేశాను అని చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో మహేష్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ కథ కార్తీకి చేరడం, అది ఆయనకు సూపర్ డూపర్ హిట్ ని అందించడం జరిగింది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: