ప్రస్తుతం
టాలీవుడ్ లో పరిస్థితి దారుణంగా ఉన్న హీరోస్ లో మాస్ మహా
రాజా రవితేజ ఒకరు. అంతేకాదు అంతే దారుణమైన పరిస్థితిలో ఉన్న
డైరెక్టర్ కూడా ఉన్నాడు. అతనే గోపిచంద్ మలినేని. వీళ్ళిద్దరికి తోడైంది
హీరోయిన్ శృతి హాసన్. వీళ్ళ కి మంచి హిట్
సినిమా పడి చాలా కాలమే అయింది. ఈ ముగ్గురికి కారణాలు రక రకాలుగా ఉన్నా అందరి పరిస్థితి ఒక్కటే. ముగ్గురికి మంచి హిట్ కావాలి. లేకపోతే ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కాస్త కష్టమే. వాస్తవంగా ఎవరెన్ని సినిమాలు చేసినా పక్కా కమర్షియల్
సినిమా చేసినప్పుడు వచ్చే ఎనర్జీనే వేరు.
మాస్ యాక్షన్ కంటెంట్ తో
బీసీ ఆడియన్స్ ను ఆకట్టుకొని భారీ వసూళ్లు సాధించే కమర్షియల్
సినిమా మీద అందరికీ బోలెడు ఆశలుంటాయి. ఇప్పుడు అవే ఆశలతో
సినిమా మొదలెట్టారు రవితేజ.. గోపిచంద్..బ్యూటి ఫుల్ శ్రుతి హాసన్. ఈ ముగ్గురికి ఇప్పుడు అర్జెంట్ గా
సక్సెస్ కావాలి. అందుకే ఓ కమర్షియల్ సినిమాకు ఈ ముగ్గురు తోడైయ్యారు.
గోపిచంద్ మలినేని 'విన్నర్' తర్వాత చాలా టైం తీసుకొని ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు.
ఇక
రవితేజ పరిస్థితి కూడా అంతే. మనోడికి హిట్
సినిమా పడి చాలా ఏళ్ళయింది. ఆ మధ్య
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి కమ్ర్షియల్ సక్సస్ కొట్టినప్పటికి ఆ తర్వాత వచ్చిన సినిమాలు డిజాస్టర్ అయి ఆ
సినిమా సక్సస్ ను తుడిచేశాయి. ప్రస్తుతం 'డిస్కో రాజా'
సినిమా చేస్తున్నా ఇందులో కమర్షియల్ అంశాలు తక్కువే ఉంటాయట. పూర్తిగా కామెడీపైనే ఆధారపడి
సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ. అందుకే గోపిచంద్ తో చేస్తున్న 'క్రాక్' పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఈ
సినిమా కమర్షియల్ గా మళ్లీ ఓ
సక్సెస్ అందిస్తుందని కాస్త ధైర్యంగా ఉన్నాడు. మరి వీళ్ళకి 'క్రాక్' సక్సస్ ఇచ్చి పైకి లాక్కొస్తుందా..లేక చెప్పుకోలేనంతగా పరిస్థితి మారుతుందా చూడాలి.