కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంది. గీతా గోవిందంతో సెన్సేషనల్ హిట్ అందుకుని తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ ఛాన్సులు అందుకుంటున్న రష్మిక మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలు చేస్తుంది.   


సినిమాలో గడుసు అమ్మాయిగా కనిపించే రష్మికకు కొన్ని భయాలు ఉన్నాయట. కొన్ని విషయాలు ఎప్పుడూ తనని భయపెడుతూనే ఉంటాయని చెబుతుంది ఈ కన్నడ భామ. ఇంతకీ రష్మికను భయపెట్టే విషయాలు ఏంటంటే తను ఎవరైనా బైక్ డ్రైవ్ చేస్తే వెనక కుర్చోవడమంటే భయమట. అంతేకాదు తనకు బైక్ డ్రైవింగ్ వచ్చినా ఒంటరిగా బైక్ మీద వెళ్లాలంటే భయం అంటుంది.  


పదిమంది ముందు మాట్లాడాలన్నా రష్మికకు భయమట. సినిమాలో తనకు ఇచ్చిన పాత్రకు నాయం చేయగలుగుతానా లేదా అన్న విషయంలో కూడా తాను భయపడుతా అంటుంది రష్మిక. అమ్మడు ఇలా చెబుతుంటే విక్రమార్కుడు సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. ప్రస్తుతం కెరియర్ పీక్స్ లో ఉన్న రష్మిక ఇలాంటి భయాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.


తెలుగులో అసలు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు. ఛలో నుండి డియర్ కామ్రేడ్ వరకు చేసింది నాలుగు సినిమాలే అయినా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్స్ లో టాప్ రేంజ్ లో ఉన్న రష్మిక ఇలానే తెలుగులో సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించాలని ఆశిద్దాం. మహేష్, నితిన్ సినిమాలే కాదు బన్ని, సుకుమార్ కాంబో మూవీలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: