బాహుబలి, బాహుబలి2 సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వఛ్చింది. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. 
 
మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా నరసింహారెడ్డి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినప్పటికీ మిగతా భాషల్లో మాత్రం హిట్ కాలేదు. సైరా సినిమా నిర్మాత రామ్ చరణ్ కు తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా ప్రాంతాలలో భారీగా నష్టాలు వచ్చాయని సమాచారం. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి తన తరువాత సినిమాను ప్రభాస్ తో తీయాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలుస్తోంది. 
 
టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేశ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. జాన్ సినిమా తరువాత ప్రభాస్ తదుపరి చిత్రం మాత్రం ఫిక్స్ కాలేదు.ఇప్పటికే ప్రభాస్ జాన్ సినిమా 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఒక కథ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ పూర్తయిన తరువాత ప్రభాస్ కు కథను వినిపించాలని సురేందర్ రెడ్డి  ప్రయత్నాలు మొదలుపెట్టాడని సమాచారం. 
 
ప్రభాస్ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం జాన్ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. సాహో హీరో ప్రభాస్, సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా అంటే భారీగా అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: