బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు స్టార్టింగ్, ఎండింగ్ అధిరిపోయింది. ఫస్ట్ వీక్ ఎపిసోడ్స్ కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అలాగే ఫైనల్
ఎపిసోడ్ కు కూడా రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చినట్లుగా
స్టార్ మా వర్గాల వారు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ కు మంచి పాపులారిటి వచ్చింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. అయినప్పటికి కొందరు సెలబ్రెటీలు
బిగ్ బాస్ 3 రీ యూనియన్ పేరుతో పార్టీలు సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ పార్టీలో
వరుణ్ సందేశ్.. వితిక.. పునర్నవి.. హిమజ..
అలీ,
మహేష్ విట్టలు పాల్గొన్నారు. ఈ పార్టీ ఫొటోలను
పునర్నవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'మిస్ యూ రాహుల్' అంటూ కామెంట్ పెట్టింది. అయితే ఈ పార్టీకి
రాహుల్ హాజరు కాకపోవడంపై తాజాగా రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి.
రాహుల్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న కారణంగా రాలేదంటే.. కొందరు మాత్రం రాహుల్-పునర్నవి మధ్య విభేదాల కారణంగా రాలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రాహుల్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో పాటలు పడటంతో పాటు పలు న్యూస్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తున్నాడట. మరో వైపు తనను ఓట్లు వేసి గెలిపించిన అభిమానులను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తానికి
రాహుల్ చాలా బిజీగా ఉన్న కారణంగానే రాకపోయి ఉంటాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పార్టీలో
రాహుల్ ఉండి ఉంటే పున్ను పిచ్చ హ్యాపీగా ఫీలయ్యోది. ఎందుకంటే
బిగ్ బాస్ లో ఉన్న సమయంలో వరుణ్.. వితిక.. పున్నుతో పాటు
రాహుల్ లు ఒక టీంలా ఉండే వారు. ఆ టీంలో ఇప్పుడు
రాహుల్ మిస్ అవ్వడం వల్ల ఈ పార్టీలో వెలితి క్లీయర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పున్ను,
రాహుల్ కి ఉన్న క్రేజే వేరు..అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక
రాహుల్ మాత్రమే కాకుండా ఇంకా పలువురు కంటెస్టెంట్స్ కూడా ఈ పార్టీలో పాల్గొనలేదని తెలుస్తోంది.