అక్కినేని ఫ్యామిలీ అంగరంగవైభవంగా ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరైంది.  నాగార్జున, అయన భార్య అమల, నాగార్జున పిల్లలు నాగ చైతన్య, అఖిల్, నాగ్ మిగతా ఫ్యామిలీ అందరూ హాజరయ్యారు.  అక్కినేని ఫ్యామిలీ సగర్వంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అనుకున్నారు.  


కానీ, అక్కడ అక్కినేని నాగేశ్వర రావు కోడలు అమల కనిపించింది.  కానీ, నాగార్జున కోడలు సమంత కనిపించలేదు.  ఎందుకని ఆమె ఈ వేడుకలు హాజరు కాలేదో తెలియడం లేదు.  అక్కినేని ఫ్యామిలీ నిర్వహించే ప్రతి వేడుకకు ఫ్యామిలీ మొత్తం యూనిటీగా హాజరవుతారు.  మిగతా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మాత్రం అందరు తప్పకుండా హాజరవుతుంటారు. 


కానీ, ఈ వేడుకకు సమంత హాజరు కాకపోవడం విమర్శలకు తావునిస్తోంది.  సమంత ఎక్కడ ఉంది.  ఎందుకు హాజరు కాలేదని అక్కినేని అభిమానులు అడుగుతున్నారు.  ఇక కొంతమంది ఏదేదో కల్పించుకొని మాట్లాడుతుంటారు.  సమంతకు ఆరోగ్యం బాగాలేదని, సమంత ప్రెగ్నెంట్ గా ఉందని, అందుకే ఆమె ఈ వేడుకలకు హాజరు కాలేదని కొందరు అంటున్నారు.  సమంత షూటింగ్ బిజీలో ఉందని మరికొందరు అంటున్నారు.  


పెద్ద పెద్ద స్టార్స్ హాజరైన ఈ వేడుకకు అక్కినేని కుటుంబం నుంచి తరువాత తరం వ్యక్తులు ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాలి.  ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అక్కినేని నాగార్జున తన ఇద్దరు కొడుకులు, కోడళ్ళకు అప్పగిస్తారు.  అందులో సందేహం అవసరం లేదు.  ఇలాంటి వేడుకల్లో సమంత చాలా స్పీడ్ గా ఉంటుంది.  మరి ఈ సమయంలో సమంత ఉంటె ఎంత బాగుంటుంది.  వేదికపై రేఖ ఉన్నది.  బోనీకపూర్ వంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు.  ఇలా అందరు ఉన్నప్పుడు సమంత కూడా ఉంటె బాగుంటుంది కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: