స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి. 

అయితే గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, తప్పకుండా వారిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా మురళి శర్మ, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా యువ నటుడు నవదీప్ నటిస్తున్నట్లు టాక్. నిజానికి సినిమాలో బన్నీకి మంచి మిత్రుడిగా కనిపించే నవదీప్

సినిమా చివరిలో అసలు విలన్ గా తేలుతాడని అంటున్నారు. గతంలో బన్నీతో కలిసి ఆర్య 2 సినిమాలో నటించి మెప్పించిన నవదీప్, ఇటీవల కాలంలో పెద్దగా అవకాశాలు లేక కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్నాడు. కాగా ప్రస్తుతం అతడు నటిస్తున్న ఈ రోల్ తప్పకుండా అతడికి కేరీర్ లో మంచి గుర్తింపుని ఇవ్వడం ఖాయమని టాక్. కాగా ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్న ఈ వార్తపై నిజానిజాలు తేలాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే. మంచి కమర్షియల్ హంగులతో ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: