బాహుబలి చిత్రం తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు ప్రభాస్. పాన్ ఇండియన్ హీరోగా బాహుబలి చిత్రం తో ఎదిగాడు. భారతీయ సినిమా అంటే ఇది అని చెప్పడమే కాకుండా అద్బుతమైన కలెక్షన్లు రాబట్టగలిగాడు. అయితే అది రాజమౌళి చిత్రం. ఆ తరువాత వచ్చిన సాహో చిత్రం ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. ఒకే ఒక్క హిట్ తో వున్న సుజిత్ చేతిలో భారీ ప్రాజెక్టుని చేతిలో పెట్టి నిర్మాతలకు కష్టాలు మిగిల్చాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీ చిత్రీకరణలో వున్నాడు. భారీ వ్యయానికి పోకుండా మితంగా ఖర్చు చేస్తూ బెస్ట్ మూవీని అందించాలనే లక్ష్యంతో చేస్తున్నట్లు సమాచారం.


అయితే కెజిఎఫ్ చిత్రం తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని కలిశాడట. అయితే ఎన్టీఆర్ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ అని వినిపించడం తో ప్రభాస్ ని కలిసినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ బాగుండటం తో ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని చెప్పాడట ప్రభాస్. అయితే మరి ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించడానికి సమయం పట్టొచ్చు. అయితే ప్రభాస్ తెలుగు దర్శకులని వొదిలి కన్నడ డైరెక్టర్ తో చేయడం పట్ల సినీ జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభాస్ రూటు మార్చడమే కాకుండా, కెజిఎఫ్ చిత్రాన్ని చూసి ఇలా సినిమా ని ఓకే చెయ్యడం పట్ల ప్రభాస్ నిర్ణయం సరైనదేనా అని కొందరు ఆలోచనలో పడ్డారు.


ఇదిలా ఉంటే... ఒకవైపు తెలుగు, తమిళం, మరోవైపు హిందీ సినిమాలతో పుల్లు బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకొచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులందరితో నటించి కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర కథానాయికగా టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆమె కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: