టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ భూమిక. `ఖుషీ`, `ఒక్కడు`, `సింహాద్రి` వంటి బ్లాక్బస్టర్ సినిమాల హీరోయిన్గా తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించుకుంది భూమికా చావ్లా. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాల్లో నటించడంతో ఈమెకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. తెలుగు లోనే కాకుండా తమిళ,హిందీ భాషల్లో కూడా నటించింది భూమిక. అప్పట్లో స్టార్ హీరోలు ఈమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించేవారు. భూమిక ప్రస్తావన వస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ తో చేసిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి మూవీలు గుర్తుకు వస్తాయి.
దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించిన భూమిక పెళ్లి తర్వాత టాలీవుడ్కు దూరమైంది. ఆ మద్య బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. పారిశ్రామిక వేత్త అయిన భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం గతంలో టాప్ పొజీషన్లో ఉన్న హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఎమ్సీఏ` సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చి `సవ్యసాచి`, `యూటర్న్` సినిమాల్లో నటించింది. వెండితెరపై పద్ధతైన పాత్రల్లో నటించిన భూమిక ఎప్పుడూ హాట్గా కనిపించలేదు.
ఎప్పుడు కూడా గ్లామర్ తరహా పాత్రలకు ప్రాధాన్య ఇవ్వలేదు..కానీ భూమిక క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. అలాంటి ఈ అమ్మడు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటో పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. బుల్లెట్ బైక్పై పడుకుని ఉండి అందాల విందు చేస్తున్నన్న ఫోటో షూట్ చూసి అందరు షాక్ అవుతున్నారు. నాలుగు పదుల వయసు దాటి కూడా రెండేళ్లు అయిన ఈ అమ్మడు ఇప్పుడు ఈ అందాల ప్రదర్శణ ఏంటో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోకు `2009` అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇది దాదాపు పదేళ్ల క్రితం తీయించుకున్న ఫొటో అని తెలుస్తోంది. భూమిక హాట్ ఫొటోకు అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.