ప్రస్తుతం ఈటీవీ ఛానెల్ టాప్లో ఉంది అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ
కామెడీ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు నిర్విరామంగా
ఆడియన్స్ ని నవ్విస్తూ వస్తుంది. అయితే గత కొంత కాలంగా జబర్థస్త్
కామెడీ షో పై రక రకాల రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. జబర్థస్త్
కామెడీ షో వల్గర్ స్కిట్స్ చేస్తున్నారని..పలువురు కోర్టుకి ఎక్కిన విషయం కూడా తెలిసిందే. జబర్థస్త్
కామెడీ షో ప్రోగ్రామ్ నుంచి రోజా ఔట్ అంటూ వార్తలు..తర్వాత నాగబాబు గుడ్ బాయ్ అని మరికొన్ని వార్తలు వచ్చాయి.
ఇక జబర్థస్త్ లో అందరినీ కడుపుబ్బా నవ్వించే హైపర్
ఆది పై కూడా రక రకాల వార్తలు వినిపించాయి.
జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్ ల పరంగా సృష్టించిన సంచలనం ఒక ఎత్తైతే, ఆ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చిన ప్లాటుఫామ్ గా నిలబడిన వైనం మరో ఎత్తు. ఈ కార్యక్రమం ప్రసారమైన సమయంలో చూసిన వారికంటే.. యూట్యూబు లో వీక్షించిన వారి సంఖ్య కొట్ల లో ఉంటుంది. జబర్థస్త్ తో ఎంతో మంది కళాకారులు వెలుగులోకి రావడమే కాదు..వెండి తెరపై మంచి కమెడియన్లుగా వెలిగిపోతున్నారు.
తాజాగా ఇప్పుడు జబర్థస్త్ మరికొన్ని రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జబర్దస్త్ గురు శుక్రవారాల్లో రెండు ఎపిసోడ్స్గా ప్రసారం అవుతుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు మూల స్థంబాలుగా నాగబాబు,
అనసూయ, సుడిగాలి సుధీర్ టీం మరియు హైపర్
ఆది టీం తో ఎంతో సందడిగా ఉంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి తారు మారు అయ్యేలా ఉంది.వీరు జబర్దస్త్ను వదిలేస్తారనే టాక్ వస్తుంది. సాధారణంగా ఎక్కువ సాలరీ ఇస్తామంటే..ఏ ఎంప్లాయ్ అయినా ఛాన్సు ఎందుకు వదులుకుంటారు?
జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలు గా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా లకైతే ఇది అద్భుతమైన వేదికగా నిలిచింది.
జబర్దస్త్ అంటేనే నాగబాబు అనేంతగా నాగబాబు ఈ షోకి స్పెషల్ అప్పియర్స్ తీసుకు వచ్చారు.
అయితే ఇప్పుడు ఈ షో నుంచి నాగబాబు తప్పుకుంటున్నారట గత వారం రోజులుగా
జబర్దస్త్ కీ నాగబాబుకీ మధ్య దూరం పెరిగిపోయిందని సోషల్ మీడియాలోనూ..
ఇండస్ట్రీ లోనూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ప్రచారాలు గతంలోనూ చాలా జరిగాయి. కాకపోతే..జీ ఛానెల్ లో ఓ ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఆ ఛానెల్ లో ప్రసారం కాబోతున్న కొత్త కార్యక్రమంలో
జబర్దస్త్ నాగబాబు ప్రత్యక్షం అయ్యారు..మరి రెండు ఛానల్స్ లో కనిపిస్తాడా లేదా నిజంగానే జబర్థస్త్ కి గుడ్ బాయ్ చెబుతారా? అన్న ప్రశ్న
ఆడియన్స్ మధిలో మెదులుతుంది. కానీ యథావిధిగా నాగబాబు తన సీట్లో ప్రత్యక్షం అవుతూ వచ్చారు..మరి ఈసారి వస్తున్న రూమర్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.