ఓ ఇద్దరు తెలుగు హీరోల మధ్య గొడవ హైదరాబాద్ నుండి ముంబై దాకా వెళ్లిందట. అదేంటి సీన్ అక్కడిదాకా వెళ్లిందా అంటే ఇది రియల్ లైఫ్ సీన్ కాదులేండి రీల్ లైఫ్ సీన్. ఇంతకీ గొడవని ముంబై దాకా కొనసాగించిన హీరోలు ఎవరంటే నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు అని తెలుస్తుంది. నాని, సుధీర్ బాబు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ 'వి'.   

 

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన యాక్షన్ సీన్స్ ప్రస్తుతం ముంబైలో షూట్ చేస్తున్నారట. నాని ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు. సీరియల్ కిల్లర్ గా ఇదవరకు ఎప్పుడూ చూడని విధంగా నాని కనిపిస్తాడట.  

 

ఇక సుధీర్ బాబు మాత్రం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. నానికి సరిసమానంగా సుధీర్ బాబు రోల్ ఉంటుందని తెలుస్తుంది. నానిని హీరోగా గుర్తించిన ఇంద్రగంటి అష్టా చమ్మ సినిమాతో అతన్ని హీరో చేశాడు. ఇక అతనిలోని కొద్దిపాటి నెగటివిటీ వాడుకుని జెంటిల్మన్ సినిమా చేశాడు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో నాని నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు.

 

తప్పకుండా తెలుగు ఆడియెన్స్ కు థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో నాని పాత్రకు అందరు షాక్ అవడం ఖాయమని అంటున్నారు. సినిమా 2020 మార్చి 25న ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ముందే రిలీజ్ డేట్ లాక్ చేసి ఆ టైం కల్లా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేయాలని చిత్రయూనిట్ ప్లాన్. సమ్మోహనం సినిమాతో మెప్పించిన ఇంద్రగంటి మోహనకృష్ణ మరి ఈ వితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
      

మరింత సమాచారం తెలుసుకోండి: