అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఒకటి వచ్చింది.

 

ఈ సినిమాకు టైటిల్ గా లాయర్ సాబ్ అని ఫిక్స్ చేశారట. రెండు మూడు టైటిల్స్ అనుకోగా లాయర్ సాబ్ అన్నది బాగుందని అదే ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ రీమేక్ సినిమకు త్రివిక్రం కూడా తన సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. లాయర్ సాబ్ కు త్రివిక్రం డైలాగ్స్ రాస్తాడని తెలుస్తుంది. 

 

పవన్ రీ ఎంట్రీ త్రివిక్రం తోనే సినిమా అనుకున్నారు కాని త్రివిక్రం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కేవలం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే చేసే వీలు కుదిరిందట. వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎం.సి.ఏ సినిమా తర్వాత వేణు శ్రీరాం చేస్తున్న సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

 

త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు చేస్తారట. సినిమా కూడా త్వరగానే పూర్తి చేస్తారని తెలుస్తుంది. లాయర్ సాబ్ గా పవన్ కళ్యాణ్ మరోసారి తన ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే కథ సిద్ధం కాగా త్వరలో పవన్ ను కలిసి క్రిష్ డిస్కస్ చేస్తాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: