టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం కేరళలో తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ విషయమై సరిలేరు యూనిట్ కాసేపటి క్రితం ఒక  అధికారిక ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారం, ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అనేది నేటి సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు తెలియపరచనుంది సినిమా యూనిట్. 

 

ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకాకపోవడంతో కొంత నిరాశపడ్డ సూపర్ స్టార్  ఫ్యాన్స్, ఒక్కసారిగా ఈ అప్ డేట్ తో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళి శర్మ, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

మహేష్ బాబు తొలివారి తన కెరీర్ లో మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు టాక్. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఇప్పటికే రెండు వరుస విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో ఎంతవరకు హ్యాట్రిక్ అందుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: