టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్స్ లిస్ట్ లో సుకుమార్ కూడా టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఆర్య నుండి రంగస్థలం వరకు ప్రత్యేకమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుకుమార్. రంగస్థలం సక్సెస్ తో తను హిట్టు కొడితే దాని రీ సౌండ్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం తెలుగులో రాజమౌళి తర్వాత త్రివిక్రం, సుకుమార్ ఈ ఇద్దరే టాప్ డైరక్టర్స్ గా చెప్పుకోవచ్చు.

 

అయితే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే సుకుమార్ తానో స్టార్ డైరక్టర్ అయ్యాడని స్నేహితులను మాత్రం మర్చిపోలేదు. రీసెంట్ గా రాజావారు రాణిగారు సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సుకుమార్ ఆ సినిమాలో నటించిన తన స్నేహితుడు కిట్టయ్య గురించి చాలా గొప్పగా చెప్పారు. మాములుగా తెలిసిన వాడు కనిపిస్తే భుజం మీద చెయి వేసి ఇతను నా స్నేహితుడు అని చెబుతాం.. కాని కిట్టయ్య అలా కాదు.     

 

నిజమైన స్నేహితుడు కిట్టయ్య. తను కూలికి వెళ్లి డబ్బులొస్తే ఆ డబ్బులతో నాకు సినిమాలు చూపించే వాడు.. నా కాలులో ముళ్లు కుచ్చుకుంటే తన కళ్లల్లో నీళ్లు వచ్చేవని కిట్టయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సుకుమార్. సినిమాల మీద ఆ ఇష్టంతోనే దర్శకుడిగా రాణించగలుగుతున్నా అని చెప్పిన సుక్కు తన స్నేహితుడు కిట్టయ్యకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు. 

 

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ జోడీగా నటించిన ఈ సినిమాను రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేశారు. రాజావారు రాణిగారు ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నవంబర్ 29న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. మరి అందరు కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సుకుమార్ వచ్చి విష్ చేశాడు కాబట్టి సినిమాకు బజ్ బాగానే ఏర్పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: