టాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది. క్రేజ్ వచ్చిన హీరోయిన్ గట్టిగా ఉంటే ఐదారేళ్లు ఉంటుంది.. ఆ తర్వాత మళ్లీ అదే కాంబో అంటూ ఫ్యాన్స్ విసుక్కుంటే కొత్త హీరోయిన్స్ కోసం ప్రయత్నిస్తారు. అయితే మునుపటి కన్నా ప్రస్తుతం హీరోయిన్స్ దశాబ్ధ కాలం పాటు కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసగిస్తున్నారు. ఈమధ్య పెళ్లైన భామలు కూడా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

 

ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న క్రేజీ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే పూజా హెగ్దె టాప్ ప్లేస్ లో ఉంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు దర్శక నిర్మాతలకు గోల్డెన్ హ్యాండ్ అయ్యింది. అల్లు అర్జున్, మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ ఇలా అందరితో సినిమాలు చేస్తూ కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది.

 

రష్మిక తర్వాత ఆ రేంజ్ లో ఛాన్సులు అందుకుంటున్న భామ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఫుల్ టాలెంట్ ఉన్న రష్మిక చేసిన నాలుగు సినిమాలతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. కన్నడ నుండి వచ్చిన రష్మిక తెలుగులో వరుస స్టార్ హీరోల సినిమా ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం స్టార్ సినిమా అంటే కుదిరితే పూజా హెగ్దె లేదంటే రష్మిక మందన్న ఈ ఇద్దరు కుదరకపోతేనే మరో హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారు.

 

దర్శక నిర్మాతల డిమాండ్ మేరకు ఈ ఇద్దరు హీరోయిన్స్ కు యూత్ లో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. పూజా హెగ్దె హాట్ లుక్స్ తో అదరగొడుతుండగా రష్మిక మాత్రం అందం అభినయం రెండిటితో అలరిస్తుంది. ఈ ఇద్దరు కాకుండా ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు కూడా మంచి ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది. పాయల్ రాజ్ పుత్ అయితే సినిమాలో గ్లామర్ షోకి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని డైరక్టర్స్ ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: