టాలీవుడ్ లో ప్రస్తుతం దర్శకుడిగా తనకంటూ కొంత ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించి దూసుకెళ్తున్న దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మొదటగా కథ, మాటల రచయితగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్, ఆ తరువాత నువ్వే నువ్వే సినిమా ద్వారా మెగా ఫోన్ పట్టి తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది. ఆ తరువాత మహేష్ తో అతడు, అలానే పవన్ తో జల్సా సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్, అనంతరం బన్నీతో జులాయి తీసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవి చూసిన త్రివిక్రమ్, వాటి ద్వారా కొన్ని గుణపాఠాలు కూడా నేర్చుకున్నారు.

 

కాకపోతే గత ఏడాది పవన్ కళ్యాణ్ తో తాను తీసిన అజ్ఞాతవాసి పై కాపీ ఆరోపణలు రావడంతో, కొంతవరకు త్రివిక్రమ్ పై విమర్శలు వెల్లివిరిసాయి. అందుకే ఇకపై తాను తీయబోయే సినిమాలు ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాలని భావించిన త్రివిక్రమ్, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాను మంచి హిట్ చేయాలని ఎంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో మంచి పంచ్ డైలాగ్స్ తో పాటు ఎక్కువగా హృదయానికి హత్తుకునే ఎమోషన్ కూడా ఉంటుంది. అయితే అలవైకుంఠపురములో సినిమాలో కొంతవరకు తన మార్క్ ని ప్రక్కన పెట్టిన త్రివిక్రమ్, ఎక్కువగా కమర్షియాలిటీ పైనే దృష్టిపెట్టినట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాలలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, 

 

ఈ వార్తపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నెగటివ్ విమర్శలు చేస్తున్నారట. వాస్తవానికి కొద్దిరోజులుగా త్రివిక్రమ్ నుండి వస్తున్న సినిమాల్లో అసలైన ఆయన మార్క్ ని పూర్తిగా మిస్ అవుతున్నాం అని, మరొక్కసారి అలవైకుంఠపురములో సినిమాని హిట్ చేయడానికి త్రివిక్రమ్ కమర్షియల్ పంథా వైపు చూస్తున్న మాట వాస్తవమే అయితే, మున్ముందు ఆయన కూడా ఒక సాధారణ దర్శకుడిగా మిగిలిపోవడం ఖాయం అంటున్నారు. అయితే ఇటువంటి పుకార్లను పెద్దగా లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని దీనిని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: