టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ నుండి నేడు ఒక కీలక ప్రకటన రావడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన మాత్రం తొలుత హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేయగా, ఇటీవల కొన్ని అనివార్య కారణాల వలన ఆమె తప్పుకోవడంతో, ఆమె స్థానములో మరొక హీరోయిన్ కోసం చాలా రోజులుగా ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతో జల్లెడ పట్టడం జరిగింది. ఇక ఎట్టకేలకు కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్, 

 

ఆమెతో పాటు సినిమాలో లేడీ విలన్ మరియు మెయిన్ విలన్ పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీనితో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టేసారు. ఇప్పటికే 70 శాతం పైగా పూర్తి అయిన తమ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 2020 జులై 30న రిలీజ్ చేయడం తధ్యమని సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇకపోతే ఇప్పటివరకు ఒలీవియా గురించి మన దేశప్రజలకు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు అస్సలు తెలియదు అనే చెప్పాలి. హాలీవుడ్ లో నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో పాటు సంగీతం, డాన్స్ లలో కూడా మంచి ప్రావిణ్యం కలిగిన ఒలీవియా ట్విట్టర్ అకౌంట్ పై ఒక లుక్ వేస్తే మీకు ఒక దారుణమైన విషయం తెలుస్తుంది. 

 

అదేమిటంటే, ఆమె ట్విట్టర్ ఖాతాని పరిశీలిస్తే, పట్టుమని పదివేల మంది ఫాలోవర్స్ కూడా ఆమెకు లేకపోవడం గమనించవచ్చు. అయితే అక్కడ నటులు ఎక్కువగా పబ్లిసిటీ కంటే తాము చేసే పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనడానికి ఒలీవియా వంటి కొందరు నటుల సోషల్ మీడియా అకౌంట్స్ లోని ఫాలోవర్సే సాక్ష్యం అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ ఆవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: