టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన తదుపరి 152వ సినిమా కోసం అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు. వరుసగా హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో వైభవంగా జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు టాక్ వినపడుతోంది. దేవాలయాల్లో జరిగే అవినీతి, అక్రమాలపై ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ స్టోరీని దర్శకుడు కొరటాల సిద్ధం చేసినట్లు సమాచారం. 

 

ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో పలు మాస్, కమర్షియల్ హంగులు కూడా ఉండనున్నట్లు చెప్తున్నారు. ఇకపోతే తొలుత ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకోవాలని భావించింది సినిమా యూనిట్. నిజానికి దేవి కూడా వరుసగా కొరటాల సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ వచ్చారు. అయితే కొద్దిరోజులుగా ఆయన ఎంతో బిజీగా ఉండడం, అలానే తమ సినిమాకు ప్రస్తుత పరిస్థితుల్లో డేట్స్ ఇవ్వలేకపోవడంతో, అతని స్థానంలో వేరొక మ్యూజిక్ డైరెక్టర్ కోసం సినిమా యూనిట్ ఎంతో వెతక సాగింది. 

 

అయితే ఎట్టకేలకు వారికి నేడు సంగీత దర్శకుడు దొరికినట్లు తెలుస్తోంది. నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. గతంలో మెగాస్టార్ మరియు మణిశర్మల కలయికలో వచ్చిన ఎన్నో సినిమాలు మ్యూజికల్ గా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా, తాను రాసుకున్న పవర్ఫుల్ స్టోరీకి మణిశర్మ అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు కొరటాల శివ, ఆయనను తీసుకోవడానికి సిద్ధం అయ్యారట.ఇక నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: