టాలీవుడ్ లో ఒకప్పుడు తన గ్లామర్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసిన నటి రమ్యకృష్ణ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తు బిజీగా మారారు.  రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ జాతీయ స్థాయిలో గొప్పపేరు సంపాదించారు.  టాప్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.  రజినీకాంత్ తో ‘నరసింహ్మ’ సినిమాలో నీలాంబరి పాత్రలో దుమ్మురేపింది.  తర్వాత బాహుబలి, బాహుబలి2 మూవీలో రమ్యకృష్ణ తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  

 

రమ్యకృష్ణ కెరీర్ బిగినింగ్ లో వరుస అపజయాలు పొందారు. అప్పట్లో ఐరన్ లెగ్ అని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపించేది.  తర్వాత ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో గోల్డెన్ లెగ్ అని కూడా అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన రమ్యకృష్ణ ప్రముఖ దర్శకులు కృష్ణ వంశిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా  రమ్యకృష్ణను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

 

టాలీవుడ్ లో రమ్యకృష్ణ కేవలం నటి మాత్రమే కాదు.. చేయి చూసి జాతకం చెప్పడంలో ఆమె సిద్ద హస్తురాలని అంటున్నారు. పాత తరం నటీమణుల్లో  చెయ్యి చూసి జాతకం చెప్పడం ఒక్క భానుమతిగారికే తెలుసు. అయితే రమ్యకృష్ణ సైతం జాతకం చూడటంతో మంచి ప్రావిణ్యం కలిగిన నటి అని అన్నారు.  ఇది స్వయంగా తాను పరీక్షించి మరీ తెలుసుకున్న విషయం అని ఆయన అన్నారు. ఒకసారి నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో .. ఎంతమంది పిల్లలో చెప్పమని రమ్యకృష్ణను అడిగాను.

 

ఆమె నా చేయి చూసి నవ్వుకుంటూ.. మీరు నన్ను పరీక్షించడం కోసం అడిగి వుంటారు .. మీ రేఖలు చూస్తుంటే ఈ పాటికే మీకు పెళ్లి అయిపోయి,ముగ్గురు పిల్లలు ఉండి ఉండాలి  అన్నారు. అంతే నేను ఒక్కసారే షాక్..నిజంగా ఆమె చెప్పింది అక్షరాలా సత్యం. జాతకాలు చెప్పడంలో ఆమె దిట్ట అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది.ల

మరింత సమాచారం తెలుసుకోండి: