టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు పై మొదటి నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ ప్రాతలో నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతిసినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా ఎన్నో ఏళ్ళ తరువాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా

 

పూజ హెగ్డే రెండు ప్రత్యేక సాంగ్స్ చేస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి, వ్యూస్ పరంగా మరియు లైక్స్ పరంగా పలు సంచలనాలు సృష్టిస్తోంది. మహేష్ బాబు అటు ఆర్మీ ఆఫీసర్ గా, అలానే మాస్ స్టైల్ లో పలికిన రెండు వేరియేషన్స్ లో ఉన్న డైలాగ్స్ తో సాగిన ఈ టీజర్ కు వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే కేవలం రిలీజ్ అయిన 9 నిమిషాల్లో ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుందంటే, టీజర్ ఏ రేంజ్ లో అదరగొడుతోందో అర్ధం చేసుకోవచ్చు. సంగీత, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్

 

మురళి శర్మ, రావు రమేష్, సుబ్బా రాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా మ్యాన్ గా రత్నవేలు పని చేస్తున్నారు. ఇక దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరగడంతో, సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: