సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రేక్షకులు, సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఈ సినిమా టీజర్‌ శుక్రవారం విడుదలైంది. 

 

మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు, మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీకోసం పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ సైనికుల కర్తవ్యం గురించి చెప్పే మాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి.  ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది.

 

ఇక ఇదిలా ఉంటే గ‌తంలో మ‌హేష్‌బాబు న‌టించిన ఒక్క‌డు చిత్రంతో మ‌హేష్‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని హీరోగా మంచి పేరును సంపాదించాడు. గ‌తంలో ఈ చిత్రం షూటింగ్ దాదాపు క‌ర్నూలు బురుజు సెంట‌ర్‌లో జ‌రిగింది. ఆ చిత్రంలో క‌ర్నూలు బురుజు ముందు నిల‌బ‌డ్డ మ‌హేష్ తిరుగులేని హిట్‌ను సంపాదించాడు.   ఇప్పుడు అదే విధంగా ఈ చిత్రంలో కూడా క‌ర్నూలు బురుజు ముందు నిల‌బ‌డి చెప్పే డైలాగులతో క‌ట్ చేసిన టీజ‌ర్ ఒక రేంజ్‌లో ఉంది. ఇక మ‌హేష్‌కి క‌ర్నూలు బురుజు సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యేట‌ట్లే ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.  కొండారెడ్డి  బురుజు ముందు మహేష్ నిలబడితే దబిడి దిబిడే..బొమ్మ సూపర్ హిట్టే అనే టాక్ అప్పుడే వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: