మహేష్ బాబును దర్శకులు ఎలా వాడుకుంటే అలా మెల్ట్ అవుతాడు.  దర్శకు ఎలా చేయాలంటే అలా ఖచ్చితంగా చేయడంలో దిట్ట మహేష్ బాబు.  అందుకే మహేష్ తో సినిమాలు చేయాలి అనుకునే సవాళ్లకు మహేష్ పెద్ద అసెట్ అవుతాడు.  చాలా ఈజీగా మౌల్ట్ అవుతాడు.  మహేష్ లోని పెరఫార్మన్స్ ను అద్భుతంగా తీసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.  


మహేష్ బాబు ఎంత సీరియస్ గా యాక్టింగ్ చేయగలడో.. అంటే జోవియల్ గా కామెడీ చేయగలడు.  ఇదే విషయాన్నీ మహేష్ బాబు ఖలేజా సినిమాలో చూపించాడు. సీరియస్ గా ఉన్నట్టే అనిపిస్తుంది అంతలోనే ఫన్ జనరేట్ అవుతుంది. అందుకే ఈ సినిమా బుల్లితెరపై టాక్ అఫ్ ది రికార్డుగా నిలిచింది.  అయితే థియేటర్లలో సినిమా పెద్దగా ఆడకపోవడం విశేషం.  


ఇక మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాలు చాలా జోవియల్ గా ఉంటాయి.  ఎక్కువగా ఫన్ జనరేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.  ఇందులో కూడా మ్యాగ్జిమమ్ ఫన్ ఉంటుంది.  అలాగని యాక్షన్ ఉండదు అనుకుంటే పొరపాటే.. కాశ్మీర్ లో మహేష్ బాబు ఆర్మీలో తన సత్తా ఏంటో నిరూపించిన తరువాత అక్కడి నుంచి కర్నూల్ రావడం అక్కడ కర్నూలులో తన సత్తా ఏంటో చూపించడం వంటివి చేస్తుంటాడు.  


అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కర్నూలు ఎందుకు రావాల్సి వచ్చింది.  కర్నూలులో ప్రకాష్ రాజ్ కు, మహేష్ మహేష్ బాబుకు వచ్చిన గొడవలు ఏంటి.. గొడవలకు కారణాలు ఏంటి అన్నది సినిమాలో చూస్తేనే గాని అర్ధం కాదు.  స్టార్ హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి.  ఒకవేళ ఈ సినిమా హిట్టయితే.. మహేష్ బాబు సంగతేమోగాని అనిల్ రావిపూడి కెరీర్ మాత్రం పీక్స్ లో ఉంటుంది.  తేడా వస్తే దారుణంగా పడిపోవాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: