ఇప్పటికే ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమాల ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలయిపోయాయి. చాలా రోజుల క్రితమే తమ సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ ని రిలీజ్ చేసిన అలవైకుంఠపురములో యూనిట్, నేడు ఓ మై గాడ్ డాడీ అనే లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే సరిలేరు మూవీ టీమ్ నుండి తొలిసారిగా మూవీ టీజర్ నేడు రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతం వ్యూస్ మరియు లైక్స్ పరంగా యూట్యూబ్ లో అద్భుతంగా దూసుకెళ్తున్న ఈ టీజర్ కు వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి అలవైకుంఠపురములో నుండి రిలీజ్ అయిన సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి, 

 

అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ సాధించి, యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పడం జరిగింది. ఈ విధంగా రెండు సినిమాలు కూడా ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్తున్నప్పటికీ, నిజంగా సంక్రాంతి విజేత ఎవరనే దానిపై టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా కొద్దిరోజుల నుండి విపరీతంగా చర్చలు మొదలయ్యాయి. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12నే రిలీజ్ కావలసి ఉండగా, నేడు ఈ రెండు సినిమాల నిర్మాతలు, పలువురు సినిమా ప్రముఖుల సమక్షంలో కూర్చుని చర్చించి, ఫైనల్ గా సరిలేరు సినిమాను ఒక్కరోజు ముందుగా అంటే, జనవరి 11న, అలానే అలవైకుంఠపురములో సినిమాని జనవరి 12న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 

 

అయితే ఈ రెండిటిలో ఏది నిజమైన విజేతగా నిలుస్తుంది అనేది చెప్పడం ఒకరకంగా కష్టం అనే చెప్పాలి. కెరీర్ పరంగా సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు, అలానే ఈ సినిమాల దర్శకులైన త్రివికమ్, అనిల్ రావిపూడి, ఇద్దరూ కూడా మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ అనే చెప్పాలి. అలానే ఈ రెండు సినిమాలు కూడా మంచి కమర్షియల్ హంగులతో పలు ఎంటర్టైన్మెంట్ హంగులతో తెరకెక్కుతుండడంతో పక్కాగా ఏది సూపర్ హిట్ అవుతుందనేది చెప్పడం కష్టమే. అయితే రేపు రెండు సినిమాల రిలీజ్ తరువాత గాని పక్కాగా దేనిది పైచేయి అనేది చెప్పగలం అంటున్నారు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: