టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఎప్పటి నుండో సూపర్ స్టార్ ఫ్యాన్స్ యొక్క ఎదురుచూపులకు తెర దించుతూ, నేడు సరిలేరు సినిమా యూనిట్, సినిమా ఫస్ట్ లుక్ అఫిషియల్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అటు ఆర్మీ మేజర్ గా, 

 

ఇటు కర్నూలు యువకుడిగా రెండు రకాల వేరియేషన్స్ లో తనదైన ఎంటర్టైనింగ్ స్టైల్ డైలాగులతో అదరగొట్టిన ఈ సినిమా టీజర్, ప్రస్తుతం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, యాక్షన్, ఫైట్ సీన్స్, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెరసి ఈ టీజర్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి ఈ టీజర్ అన్ని విధాలుగా అందరినీ మెప్పించినప్పటికీ, హీరోయిన్ రష్మిక ఫ్యాన్స్ మాత్రం టీజర్ పై కొంత నిరాసక్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

 

టీజర్ లో హీరోయిన్ రష్మిక ఒక్క బిట్ లో కూడా కనపడకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారని, అయితే కొద్దిరోజుల్లో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కాబోయే ట్రైలర్ లో రష్మిక తనదైన స్టయిల్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటారని సరిలేరు యూనిట్ చెప్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్ గా అలానే, రత్నవేలు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: