సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ సినిమా ప్రారంభం కాకముందే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వరుస విజయాల మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు సినిమా అదేవిధంగా ‘నాపేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురంబులో’ సినిమా రెండు సినిమాలు ఒకే రోజు అనగా జనవరి 12వ తారీకున విడుదల చేస్తున్నట్లు పోస్టర్ పై క్లారిటీ ఇచ్చారు.

 

ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్న నేపథ్యంలో ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చాలెంజ్ చేసుకుంటూ...ఉంటున్న తరుణంలో ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఒకే రోజు సినిమా విడుదల చేయటం వల్ల ఇండస్ట్రీలో వాతావరణం పాడైపోతుంది అంటూ సూచనలు ఇవ్వడంతో అంతేకాకుండా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇలా చేస్తే తమకి లాభాలు రావడం కష్టమని చెబుతున్న తరుణంలో మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ తమ సినిమా విడుదల డేట్ విషయంలో తమ నిర్ణయాలు మార్చుకొని ఒక్కొక్కరు ఒక రోజు తమ సినిమాని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ముఖ్యంగా తమ సినిమాలను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోతారన్న భావనతో ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11 వ తారీకున మరియు అదే విధంగా 'అలా వైకుంఠపురం లో' సినిమా జనవరి 13వ తారీఖున వస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ ఇటీవల విడుదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకుంటుండగా...మరోపక్క అల వైకుంఠ పురంబులో సినిమా పాటలు సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. దీంతో రెండు సినిమాలపై అంచనాలు ప్రేక్షకులను విపరీతంగా నెలకొన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: