టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేసినట్లు మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సంక్రాంతికి ఈ సినిమా చరిత్రలో నిలుస్తుందని అన్నారు. కాగా, ఈ టీజర్ లో మహేష్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. గ్రేడ్ మార్కును తీయాసుకొచ్చారు. ముఖ్యంగా ఇందులో  సాగిన.. 

 

"భయపడేవాడే బేరానికి వస్తాడు... మనదగ్గర బేరాల్లేవమ్మా...." అంటూ తనదైన శైలిలో పలికిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు" అంటూ విజయశాంతి, "ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్ రాజ్ పలికిన సంభాషణలు ఆడియన్స్ లో కనెక్ట్ అవుతాయనడంలో సందేహంలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రష్మిక మందన్న కథానాయిక. 

 

ఇకపోతే మహేష్ కు యాక్షన్ కోణంలో తెరకేక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. మిలటరీ ఆఫీసర్ అజయ్ పాత్రలో, ఫ్రెండ్ కోసం దేనికైనా రెడీ అంటూ ఉన్న ప్రాత్రలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న రిలీజ్ అయినా ట్రైలర్ కు జనల నుండి మంచి స్పందన లభిస్తుంది. దానితో సినిమాపై టాలీవుడ్ లో మంచి డిమాండు ఏర్పడుతుంది.  

 


అందుతున్న సమాచారం ప్రకారం టీజర్ లో విజయశాంతి, ప్రకాష్ రాజ్ లు చెప్పిన డైలాగులు ఓ మోస్తరు ఆకట్టుకున్న కూడా సినిమాకు వాళ్ళు సెట్ అవ్వలేదని పబ్లిక్ అంటున్నారు. అమ్మగా విజయశాంతో మహేష్ కు కనెక్ట్ అవ్వలేదు, నదియా అయితే బాగుండేదని అన్నారు. డైలాగులు చెప్పడంఒక ఎత్తైతే బెటర్ కానీ, కథకు మ్యాచ్ అయ్యేలా లేదు అనే టాక్ వినపడుతుంది. ఏది ఏమైనా కూడా సినిమా రిలీజ్ అయ్యాకే చెప్పాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: