అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు తారాగణంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాని కాపీ కొట్టారంటూ ఇంటర్నెట్లో కామెంట్లు బీభత్సంగా వస్తున్నాయి. నెటిజన్లు ప్రకారం... ఈ సినిమాను కాపీ కొట్టింది ఏ సినిమా నుంచి అంటే అల్లు అర్జున్ తీసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.

తాజాగా సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదలయిన విషయం మనకి తెలిసినదే. అయితే దీనిలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించిన తీరు.. మళ్లీ ప్రజల్లోకి వచ్చి అరాచకాలు ఆపిన తీరును చూస్తే అచ్చం అల్లు అర్జున్ తీసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథలాగానే ఈ సినిమా కూడా ఉంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. నాపేరు సూర్య సినిమాలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి తర్వాత సమాజంలో జరుగుతున్న అరాచకాలను అరికడతాడు. ఈ పాయింట్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాని ట్రోల్ చేస్తున్నారు.

ఆర్మీ ఆఫీసర్ అంటే అల్లు అర్జున్ లాగా ఉండాలంటూ... ఆర్మీ పాత్ర కోసమే అల్లు అర్జున్ తనని తాను ఎంతో మార్చుకున్నాడు అంటూ... మహేష్ బాబు ఏం చేంజ్ అవ్వలేదు.. ఏం కొత్తదనం లేదు... ఎప్పటిలాగానే ఉన్నాడంటూ అల్లు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి ఎదురు కౌంటర్ ఇస్తున్నారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ కన్నడ ముద్దుగుమ్మని కనీసం ఒక సెకను కూడా టీజర్ లో చూపించనందుకు అటువైపు రష్మిక ఫ్యాన్స్ కూడా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందాన్ని తిట్టిపోస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: