యంగ్ హీరో నితిన్ కు  ఇష్క్ తర్వాత అతడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. ఈ చిత్రం తర్వాత అతడు కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, నితిన్ నటించిన చివరి రెండు మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా నితిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది

 

    పరాజయాలు పలకరిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వాటినుండి బయటపడడానికి  వైవిధ్యమైన కథలకు ఓకే చెప్పినప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. దీంతో సరికొత్త కథలకు ఓకే చెబుతూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ‘భీష్మ', ‘రంగ్ దే', ‘చదరంగం' వంటి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.


  నితిన్ హీరోగా సినిమాలు చేయడంతో పాటు నిర్మాతగానూ పలు సినిమాలకు బాధ్యతలు నిర్వర్తించాడు. తన సినిమాలైన ‘గుండే జారి గల్లంతయ్యిందే', ‘చిన్నాదానా నీకోసం'తో పాటు అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్‌'ను కూడా అతడే నిర్మించాడు. ఈ మూడు సినిమాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టకపోగా, నష్టాలనే మిగిల్చాయి. తాజాగా నితిన్ మరో సినిమాను నిర్మించాలనుకుంటున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోను తీసుకోవాలని అతడు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. నూతన దర్శకుడితో ఈ కథను సిద్ధం చేయించినట్లు సమాచారం.


  బాలీవుడ్‌లో చిన్న సినిమాగా  విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన ‘అంధాధున్'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమానే నితిన్ నిర్మించబోతున్నాడని తెలుస్తోంది.

 

    ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే ఈ రైట్స్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. మాతృక నిర్మాతైన వయాకామ్ 18 తెలుగులోనూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుందట. మొదట ఈ సినిమాను నితినే చేస్తాడనుకున్నారు. కానీ, అతడికి కమిట్‌మెంట్స్ ఉండడంతో మరో హీరోను ట్రై చేస్తున్నారని టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: