సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బోల్డ్ కామెంట్స్ చేస్తూ తరుచు వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు చిన్మయి కొన్ని హాట్ కామెంట్స్ చేసి దుమారం రేపింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఓ మహిళ ఎదుర్కొన్న షాకింగ్ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి వద్దకు వెళ్లాడు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన ఆ యువతిని చూసి ‘అన్నీ కనిపిస్తున్నాయి చున్నీ కప్పుకోండి’ అన్నాడట. దాంతో ఆమెకు ఒళ్లుమండింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి సోషల్ మీడియాలో పేర్కొంది. 

 

పనిలో పనిగా స్విగ్గీ లో పని చేస్తున్న ఉద్యోగులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. స్విగ్గీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి పని వారు చేసుకుంటే మంచిది అని చెప్పండి. మీ సంస్థకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ పార్సిల్ ఇవ్వడానికి వచ్చి చున్నీ కప్పుకో అని నాకు చెప్పి సలహా ఇచ్చి వెళ్తున్నాడు. నా ఇంట్లో నేను ఎలా ఉండాలో చెప్పడానికి వాడెవడు. అసలు నేనెలా ఉంటే వాడికేంటి? వారికి ఇతరులతో ఎలా నడుచుకోవాలో కూడా మేమే నేర్పించాలా?’ అని మండిపడింది. దాంతో కొద్ది సేపట్లోనే ఆమె ట్వీట్ వైరల్ అయింది. కొందరు నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తే మరికొందరు కామెంట్స్ చేశారు. తనను ఎగతాళి చేస్తున్నవారిపై స్పందిస్తూ.. ‘ఈ ఘటన గురించి ఎవరైనా జోక్‌గా కామెంట్లు చేస్తే అందరినీ బ్లాక్ చేస్తాను’ అని బెదిరించింది. 

 

 

అయితే సింగర్ చిన్మయి ఈ ట్వీట్ కు స్పందిస్తూ .. ఈ ట్వీట్స్‌పై చిన్మయి ఆ మహిళకు మద్దతు తెలుపుతూ పచ్చిగా కామెంట్స్ చేశారు. ‘మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే.. వారు చిన్నప్పుడు తల్లి వద్ద పాలు తాగి ఉండరు. ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పుకోకపోతే వాటి వల్లే రేప్స్ జరుగుతాయి అనుకుంటారు. కొంతమంది డెలివరీ ఏజెంట్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఒక డెలివరీ ఏజెంట్‌కు అతను ఫుడ్ తీసుకెళ్లే ఇళ్లన్నీ ఆఫీసులతోనే సమానం. మన దగ్గర డ్రైవర్‌గా, సర్వెంట్స్‌గా పనిచేసేవారికి మన ఇళ్లు ఆఫీసులే’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: