చంద్రముఖిలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన పరిచయం అయిన నయనతార హవా ఇప్పటికి  కొనసాగుతోందనడానికి ఇది మరో ఉదాహరణ. 2019 లో తెలుగులో వచ్చిన  సైరా, తమిళంలో వచ్చిన బిగిల్‌ విజయాలతో మళ్ళీ కొత్త అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ అమాంతం పెంచిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె సినిమాకి ఐదు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

కానీ దాన్ని తాజాగా 8 కోట్లకి  పెంచేసినట్లు సమాచారం. నయనతారకు ఉన్న క్రేజ్‌తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. తమ సినిమాల్లో నటించమని అడిగిన ప్రొడ్యూసర్లపై నయనతార రెమ్యూనరేషన్ అనే బిగ్‌ బాంబ్‌ వేసినట్లు తెలుస్తోంది. అయితే భారీగా పారితోషకం పెంచినప్పటికీ తమ సినిమాలో నయనతారే నటించాలని కొంత మంది దర్శక నిర్మాతలు పట్టుబడుతున్నారట.  

 

ప్రస్తుతం రజనీకాంత్‌తో నటిస్తున్న దర్బార్‌ చిత్రాన్ని పూర్తి చేసిన నయనతార ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నశ్‌ శివన్‌ను నిర్మాతగా చేసి నెట్రికన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే  ఆర్‌జే.బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ముక్కుత్తి అమ్మన్‌ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు అని తెలుస్తుంది. ఇది భక్తి రస కథా చిత్రంగా ఉంటుందని ఆర్‌ కే.బాలాజీ ఇటీవల వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే ఇందులో నయనతార అవకాశం అడిగి మరీ చేస్తుంది అట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్‌జే.బాలాజీనే తెలిపారు.  ఈ కథ గురించి నయనతారకు తెలియటంతో ఆమె వెంటనే ఆర్‌జే.బాలాజీకి ఫోన్‌ చేసి ఏమిటీ ఎవరెవరికో కథ వినిపిస్తున్నావట. నాకు చెప్పవా?అని అడిగారని బాలాజీ తెలిపారు.

 

 నయనతార ఈ చిత్రానికి 8 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందనేది తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంత పారితోషకాన్ని ఆమెకు ముట్ట జెప్పడానికి చిత్ర నిర్మాత ఒపుకున్నట్లు సమాచారం. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత ఐసరిగణేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకోవడానికి ప్రియుడితో కలిసి న్యూయార్క్‌ చెక్కేసిన నయనతార తిరిగి రాగానే ముక్కుత్తి అమ్మన్‌ చిత్రంలో నటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: