టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది త్రివిక్రమ్- అల్లు అర్జున్.  వీరిద్దరి కాంబిషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ గా నిలిచాయి.  పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత త్రివిక్రమ్ చాలా గ్యాప్ తీసుకొని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘అలా వైకుంఠపురములో’ సినిమా తీస్తున్నారు. ఇక నాపేరు సూర్య మూవీ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్  ‘అలా వైకుంఠపురములో’ ఎంతో కసిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తుంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీ ప్రమోషన్ వర్క్ అప్పుడే మొదలైంది.  

 

టైటిల్ టీజర్ ని ముందుగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత  'సామజవరగమన', 'రాములో రాములా' పాటలు అంచనాలకి మించి హిట్ అయ్యాయి.  గత నెల రోజుల నుంచి యూట్యూబ్ లో ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా ఈ సాంగ్స్.  ఎక్కడ విన్నా 'సామజవరగమన', 'రాములో రాములా' సాంగ్స్ వినిపిస్తు..అంచనాలు దాటిపోయాయి. ఒక దశలో వీటికి పోటీగా పాటలు విడుదల చేయడానికి మిగిలిన సినిమాలు వెనుకడుగు వేస్తున్నాయంటే ఈ పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు.

 

అలాంటి సమయంలో  ‘అలా వైకుంఠపురములో’ మొదటి ఫెయిల్యూర్ వచ్చిందని అంటున్నారు..అదేంటీ సినిమా రిలీజ్ కాలేదు అప్పుడే ఈ టాక్ రావడం ఏంటా అనుకుంటున్నారా? అవును..  'సామజవరగమన', 'రాములో రాములా' సాంగ్స్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సమయంలో రీసెంట్ గా ఈ సినిమా నుండి మూడో పాట వచ్చింది. అదే 'ఓ మై గాడ్‌ డాడీ' ఈ పాట పిక్చరైజేషన్ బాగున్నా సాంగ్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. స్లోగా అయినా.. ఈ పాట జనాలకు ఎక్కుతుందని కానీ అలా జరగలేదు కదా..కనీసం ఈ పాట గురించి ప్రస్తావన కూడా లేకుండా పోయింది. మరి ఈ మూవీ నుంచి నాలుగో పాటగా..మంచి మాస్ బీట్ అని అంటున్నారు. మరి ఆ పాట ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్  విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: