వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో రికార్డులు పగలగొడుతు….తన అభిమానులు కాలర్ ఎగరేసుకునేల సినిమాలు చేస్తూ...దూకుడుగా సినిమాలు చేస్తున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్నారు. 'భరత్ అనే నేను', 'మహర్షి'.. లాంటి 2 బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం కోసం సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లో మహేష్ చాలా ఎనర్జిటిక్ గా...సినిమా డైలాగులు చెప్పి తనలోని కొత్త వర్షన్ చూపించడంతో...సోషల్ మీడియాలో యూట్యూబ్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ కి బ్రహ్మరథం పడుతున్నారు.

 

విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి సరికొత్తగా రికార్డులు మహేష్ నెలకొల్పారు. దీంతో టీజర్ సూపర్ డూపర్ గా ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి సరిలేరు నీకెవ్వరు సినిమా పాటల పై పడింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరిస్తున్న క్రమంలో...గత కొంత కాలం నుండి దేవిశ్రీ అందించిన ఆల్బం లు పెద్దగా సంగీత ప్రియులను ఆశించిన స్థాయిలో పెద్దగా ఆదరణ దక్కించుకోవడంలో విఫలం కావడంతో...దేవి శ్రీ ప్రసాద్ ఇలాంటి పాటలు ఇచ్చాడో...అన్న ఉత్కంఠ తో సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు నెలకొంది.

 

ఇదే క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ కూడా కొంత టెన్షన్ పడుతున్నట్లు పాటలకి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో అన్న ఉత్కంఠత తో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా...రష్మిక మందన నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: