ఈషా రెబ్బా తెలుగులో ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో సరసన అరవింద సమేత సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయిన ఇషా రెబ్బకు బ్రేక్ రాలేదు. అయితే ఇషా ఇక లాభం లేదననుకొని బోల్డ్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది. అయి రాగల 24 గంటల్లో సినిమాతో మరో విజయాన్ని కైవసం చేసుకుంది నటి ఇషా రెబ్బా. కాస్త గ్యాప్ వచ్చిన తరువాత సినిమాలు చేసిన ఇషా రెబ్బకు ఈ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది. హీరో సత్యదేవ్ కన్నా హీరోయిన్ ఇషా రెబ్బాకే ఈ సినిమాలు ఎక్కువ మార్కులు పడ్డాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా ప్రేక్షకుల నాడి పట్టింది. తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోందని దర్శకుడు శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు శ్రీనివాసుల రెడ్డి తనతో కొన్ని సీన్లు చెప్పారని అప్పుడు ఆయన ఆ సీన్లు చెప్పేందుకు ఇబ్బందిపడ్డారని ఇషా రెబ్బ చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం తన భర్త, తనకు మధ్య జరిగిన రొమాన్స్ సీన్ల వల్లే ఉంటుందని.. కథ మలుపులు తిరుగుతూ సస్పెన్స్‌కు దారితీస్తుందని.. ఆ సీన్లు ఖచ్చితంగా తీయాలని, ఆ సీన్లలో నటించడం ఏమీ అభ్యంతరం లేదు కదా అని అడిగారు.ఆ సీన్లు అంటే శోభనం సీన్లు.. దర్శకుడు అలా చెప్పడానికి కూడా మొహమాటపడ్డారు. 
 
 
సినిమా మొత్తం హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే శోభనం సీన్స్ .. రొమాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇషా రెబ్బా రెచ్చిపోయి నటించిందని అభిమానులు చెబుతున్నారు. కానీ సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. శోభన సీన్లలో నా పర్మాన్సెన్స్ అదిరిపోయిందంటూ చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దర్సకుడు శ్రీనివాసులరెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అని తెగ సంబరపడిపోతుంది ఇషారెబ్బా.

మరింత సమాచారం తెలుసుకోండి: