వివాదాస్పద చిత్ర దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. తన రాబోయే చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కే ఏ పాల్, రామ్ గోపాల్ వర్మ నిర్మించిన తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
తాజా పరిణామాల ప్రకారం, కే ఏ పాల్ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. కే ఏ పాల్ ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ తనను అవమాన పరిచారు అని పేర్కొన్నారు. ఆర్ జి వి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలను ఆపివేయాలని కే ఏ పాల్ డిమాండ్ చేశారు. త్వరలో ఈ విషయం పై హై కోర్ట్ ఒక నిర్ణయాన్ని ప్రకటించనుంది.
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' యొక్క ప్రచార కార్యక్రమాలలో చాలా బిజీగా ఉన్నారు, వివాదాస్పద పాత్రలతో కూడిన వివాదాస్పద చిత్రం ఇది. సినీ పరిశ్రమలో ఆర్ జి వి ఈ వివాదాస్పద చిత్రం తీయడానికి గల ముఖ్య కారణం తన మునుపటి చిత్రం 'లక్ష్మి ఎన్టీఆర్' విజయవంతం కావడమే అని అంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఆధారంగా చేసుకొని నిర్మితమైన చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. నవంబర్ 29 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్, సినీ ప్రేమికుల ఉత్సుకతను పెంచి వారు సినిమా వీక్షించడానికి థియేటర్ కు వచ్చేటట్టు ప్రేరేపించింది. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం వివాదాస్పద కంటెంట్ కలిగి ఉండి ఆంధ్ర ప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీలను చికాకు పెట్టబోతోంది. జనవరి నెలలో ఆర్ జి వి తన హోటల్ రూమ్ లో తన పాదాలను తాకడని కే ఏ పాల్ చెప్పగా, ఆర్ జి వి మాత్రం తాను కే ఏ పాల్ పాదాలను తాక లేదు, కే ఏ పాల్ ను నేల పై లాగడానికి ప్రయత్నించాను అని వెటకారంగా మాట్లాడారు.