ఇటీవల కామాంధుల చేతుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య చేయబడటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈనెల 27వ తారీకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి వెళ్ళిన ప్రియాంక తిరిగి ఇంటికి రాకపోవడంతో మధ్యలో తన సోదరి కి ఫోన్ చేసి స్కూటీ టైర్ పంచర్ అయిందని తెలపడంతో మరియు అదే విధంగా తనకు భయంగా ఉందని చెప్పిన కొద్దిసేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో...బుధవారం నాడు మిస్సయిన ప్రియాంక రెడ్డి గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.

 

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఈ తప్పు చేసిన వారిని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంత దారుణంగా ఏ ఒక్క మగాడు భవిష్యత్తులో చేయకూడదన్న ఆలోచన వచ్చేటట్లు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో చాలామంది సెలబ్రిటీస్ ప్రియాంక రెడ్డి హత్య పై స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

 

గుణ 369 సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడే తనకు నాలుగైదు రోజులు డిస్టర్బింగ్ గా ఉండేదని.. అలాంటిది నిజంగా అలాంటి ఘటన జరగడం, మనం దాని గురించి ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటని అన్నారు. ప్రియాంక ఆత్మ ఎలానూ శాతించదని, అందుకే రెస్ట్ ఇన్ పీస్ సొసైటీ అనడం బెటర్ అని చెబుతూ 'సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ప్రియాంక హత్య గురించి స్పందిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: