డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై అంచనాలు బీభత్సం గా ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ సాధిస్తారని తమ కాలర్ మళ్లీ మహేష్ ఎగరేసిలా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నవంబర్ 22 వ తారీకు సాయంత్రం విడుదలైన సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండగా …. సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా త్వరలో సినిమా రిలీజ్ కాబోతున్న క్రమంలో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎవరూ ఊహించని విధంగా సరైన ప్లాన్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీం వేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

ప్రస్తుతం ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ప్రి రిలీజ్ వేడుక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని తలపించే విధంగా మహేష్ కెరీర్లోనే అతి పెద్దగా జరిగింది.

 

అయితే తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ కార్యక్రమం భరత్ అనే నేను సినిమా ని మించి చేయాలనే ఉద్దేశంతో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు భారీ స్థాయిలో వేదిక ఉండేలా ఇప్పటినుండి నిర్మాతలు ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తారీకున సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: