2019 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాల వరకు ప్రేక్షకులను బాగా అలరించాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అదిరిపోయే రికార్డులు సృష్టించి మెగాస్టార్ కెరియర్లోనే మర్చిపోలేని రికార్డు మూవీ గా నిలిచిపోయింది. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అత్యధికంగా ఫాస్టెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. అయితే రాజకీయాల నుండి సినిమాల్లోకి చిరంజీవి రి-ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో రాబోయే ఏడాది ఫస్టాఫ్ లో కొరటాలతో చేయబోయే సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో ఆ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో చిరంజీవి ఉన్నారట.

 

ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా 2019 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. తన కెరీర్లో 25వ సినిమా అయినా ‘మహర్షి’... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కడం జరిగింది. సినిమా విడుదలయ్యే సూపర్ డూపర్ హిట్ కావడంతో 2018 సంవత్సరంలో ‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్...తర్వాత వెంటనే ‘మహర్షి’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకోవడంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో ప్రస్తుతం వచ్చే ఏడాది 2020 సంవత్సరంలో హ్యాట్రిక్ కొట్టడానికి మహేష్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే రాబోయే ఏడాది ఫస్టాఫ్ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చేయబోయే సినిమాలు ఎక్కువగా హ్యాట్రిక్ ఫార్ములా చుట్టూ తిరగబోతున్నట్లు ఫిలింనగర్లో లేటెస్ట్ న్యూస్. విషయంలోకి వెళితే వచ్చే ఏడాది ఫస్టాఫ్ సీజన్లో విడుదల కాబోతున్న సినిమాలలో మహేష్ మరియు అల్లు అర్జున్ సినిమాలు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాయి.

 

మహేష్ వరుసగా రెండు వరుస విజయాలను నమోదు చేసుకోవడంతో ….సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవగా మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో నటించిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ‘అలా వైకుంఠపురం లో’ సినిమాతో హ్యాట్రిక్ కోటే ఆలోచనలో బన్నీ ఉన్నాడు. ఇదే క్రమంలో బోయపాటి బాలకృష్ణ దర్శకత్వంలో మూడో సినిమా రాబోతున్న తరుణంలో ఆ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టడానికి 2020 ఏడాదిని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా హీరోల సక్సెస్ వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో హ్యాట్రిక్ చుట్టూ తిరగడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: