ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఔత్సాహికులు వెలుగు లోకి వస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో బేబీ అనే ఓ గ్రామీణ మహిళ పాడిన పాటలు విని టాలీవుడ్ పెద్దలు ఆశ్చర్యపోయారు. పల్లె కోయిల, సన్సేషనల్ గాయిని బేబీకి తన కొత్త సినిమాలో అవకాశం ఇచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు కుంచే రఘు.  గాయిని బేబీ పాటలు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖను కూడా సంతోష పెట్టాయి.  ఎంతలా అంటే స్వయంగా ఆమెను వారి ఇంటికి పిలుపించుకొని గౌరవించి మరీ బేబీ పాడిన పాటలు విన్నారు.  ఇక గాన గందర్వులు బాలసుబ్రమాణ్యం సైతం బేబీ గానానికి ఫిదా అయ్యారు.  

 

ఇదే రీతిలో బాలీవుడ్ లో సైతం ఓ సింగర్ పుట్టుకొచ్చింది. ఒక్క‌పాట‌తో ఓవ‌ర్‌నైట్ సెల‌బ్రిటీగా మారిన సింగ‌ర్ ర‌ణుమొండ‌ల్‌. లతా మంగేష్కర్ పాడిన‌ ఏక్ ప్యార్ కా నాగ్మా హై అనే పాట‌తో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది.  అయితే ఇటీవ‌ల ఓ అభిమాని త‌న‌తో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల‌లోకి ఎక్కింది. ఆ సంఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో, నెటిజ‌న్స్ ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ని తప్పుప‌ట్టారు.  దీనిపై నెటిజన్లు ఎన్నో విమర్శలు గుప్పించారు.  తాజాగా మరో వీడియో కూడా వైరల్ అయ్యింది.

 

ఈ మద్య ర‌ణు ఓ మాల్ ఓపెనింగ్‌కి హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో ఓవ‌ర్ డోస్ మేక‌ప్ వేసుకుంద‌ని విమ‌ర్శ‌లు తలెత్తాయి. దీనిపై కూడా ర‌ణు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందిచ‌క‌పోగా, మేక‌ప్ ఆర్టిస్ట్ సంధ్య సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన ఫోటో ఫేక్ అని తేల్చేసింది.  ఇలాంటి పలు కారణాలతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఆమె కుమార్తె ఎలిజబెత్ సాథీ స్పందించారు. ‘మా అమ్మపై ఇటువంటి విమర్శలు వస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది.

 

ఆమె ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో ఎవరికీ అర్థం కాదని..ఇప్పుడు ఆమె జీవితంలో విజయం లభించింది. అయితే ఇటువంటి సందర్భంలో చాలామంది ఆమెను విమర్శిస్తున్నారు.  తన తల్లి ఎంతగా విమర్శలకు గురవుతున్నా, ఆమె పాటలు ఆదరణ పొందుతుండటం ఆనందంగా’ ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: