విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది ఎఫ్ ౨ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత వెంకీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వెంకీ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. దానిలో భాగంగానే వెంకీమామాతో ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నాడు. అయితే వెంకీ మామా తర్వాత వెంకతేష్ మరో చిత్రం రెడీ అవబోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన "అసురన్" చిత్రన్ని తెలుగులో వెంకీ హీరోగా రీమేక్ కి ప్లాన్ చేస్తున్నారు.

 

అసురన్ రీమేక్ హక్కులని సురేష్ బాబు మంచి ఫ్యాన్సీ రేటుకి కొనుక్కున్నట్లు సమాచారం. అయితే తెలుగులో రీమేక్ కోసం అసురన్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలో మార్పులు ఉండబోతున్నాయని సమాచారం. అయితే ఈ మార్పులను స్వయంగా వెంకీనే దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట.  రచయితలకి అప్పగిస్తే తన ఆలోచనలని అందుకోవట్లేదన్న కారణంగా వెంకీ దగ్గరుండి మరీ మార్పులు చేస్తున్నాడట.

 

అయితే వెంకీ పట్టుదల చూస్తుంటే ఎలాంటి పొరపాటు జరగకూడదనే తపన ఆయనలో కనిపిస్తోంది. అసురన్ కథాంశం తెలుగు ఆడియన్స్ లో అన్ని వర్గాల కు కనెక్టయ్యేలా తీర్చిదిద్దాలనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పెన్ పట్టుకుని స్క్రిప్ట్ పనుల్లో కూడా ఉంటున్నాడట. వెంకటేష్ ఇప్పటి వరకు చాలా రీమేక్ లు చేశాడు. ఇటు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తూనే రీమేక్ లు కూడా చేశారు.

 

 

మరి ఈ సినిమాకి ఇంత శ్రద్ధ తీసుకోవడంతో అందరి దృష్టి మరింత ఎక్కువగా పడనుంది.  వెంకీ ఇన్వాల్వ్ మెంట్ సినిమా సక్సెస్ విషయంలో తోడ్పడుతుందా లేదా చూడాలి.  సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న  అసురన్ తెలుగు రీమేక్ లో వెంకటేష్ సరసన శ్రియ నటించనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: