టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ పరంగా దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ సాధించి ఉండడంతో, ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితోపాటు మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కూడా వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస హిట్స్ అందుకుని ఉండడంతో, 

 

సరిలేరు నీకెవ్వరు తో ఆయన గ్యారెంటీగా హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. పక్కా మాస్ బీట్ తో సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో ఈ పాటలో దర్శనం ఇవ్వనున్నట్లు పాటను బట్టి అర్ధం అవుతోంది. బ్లెజ్ మరియు రనిన రెడ్డి కలిసి అదగొట్టిన ఈ సాంగ్ రేపు థియేటర్స్ లో అదరగొట్టడం ఖాయంగా కనపడుతోంది. 

 

ఇక ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సంగీత, హరితేజ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా, మహేష్ బాబు, దిల్ రాజు మరియు అనిల్ సుంకర ఈ సినిమాను ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: