టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.  ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడితో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.   ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.  మొదటిసారిగా మహేష్ బాబు ఓ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.  అల్ టైమ్ రికార్డు గా టీజర్ నిలిచింది.

 

 తాజాగా ఈ మూవీ నుంచి మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  మహేష్‌ గతంలో ఎన్నడూ చేయనంత మాస్‌ సాంగ్‌ను ఆడియన్స్‌కు చూపించాలని భావించాడు. అయితే అనిల్‌ ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. సోమవారం రిలీజ్ చేసిన మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటల లిరకల్‌ వీడియోలను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. వాటిలో రెండు పాటలు బ్లాక్‌ బస్టర్స్‌ అయ్యాయి. అయితే నిన్న రిలీజ్ చేసిన మాస్ సాంగ్ పరమ వరస్ట్ గా ఉందని అంటున్నారు ఫ్యాన్స్.  మరోవైపు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘అలా వైకుంఠపురములో’ మూవీలో మాస్ సాంగ్ రాములో రాములా దుమ్మురేపుతుంది.  

 

ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో మాస్ సాంగ్స్ కి ప్రాణం పోసిన దేవీ శ్రీ ఇలాంటి పాట కంపోజ్ చేశారా అని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సాంగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ను సోషల్‌ మీడియాలో ఆటాడుకుంటున్నారు నెటిజెన్లు. కొంత మంది `మీ స్థాయికి తగ్గట్టుగా లేదు` అంటూ ట్వీట్ చేయగా.. ఓ వ్యక్తి `నీకు పెద్ద దండం రా సామి.. బొక్కలో సాంగ్‌` అంటూ కామెంట్ చేశాడు. ఇక దేవి పనైపోయిందని..తమన్ ని లేదా మణిశర్మలను ఎందుకంటే ఈ మద్య వీరి కంపోజ్ చేసిన మాస్ సాంగ్స్ కి మంచి క్రేజ్ వస్తుంది..అందుకే వారు వస్తే బెటర్ అని కొంత మంది అంటున్నారు. `మహేష్‌ వాయిస్‌ తప్ప పాటలో ఏం లేదు`, `దేవీ శ్రీ మోసం చేశాడు`లాంటి కామెంట్స్‌ చాలా వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: