సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న  లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు  నుండి  నిన్న  మొదటి సాంగ్  మైండ్ బ్లాక్  విడుదలై  ఫాన్స్   ను ఆకట్టుకుంటుంది.  ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో  ట్రెండింగ్  లో  కొనసాగుతుంది. ఇక ఈ సాంగ్   24 గంటల్లో 9.2 మిలియన్ల వ్యూస్  తో సౌత్ ఇండియా లో   అత్యధిక  వ్యూస్ రాబట్టిన   లిరికల్ సాంగ్ గా రికార్డు సృష్టించింది.  ఇటీవల విడుదలైన  ఈచిత్రం యొక్క టీజర్ కూడా  అత్యధిక వ్యూస్  ను రాబట్టుకోగా  తాజాగా  ఈ సాంగ్ కూడా  అదే బాటలో పయనిస్తూ  సినిమా పై అంచనాలను పెంచేసింది. 
 
 
 
సక్సెస్ ఫుల్  డైరెక్టర్  అని రావిపూడి  తెరకెక్కిస్తున్న  ఈచిత్రం   ప్రస్తుతం చివరి  షెడ్యూల్ షూటింగ్ ను  జరుపుకుంటుంది. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో    సీనియర్  హీరోయిన్ విజయశాంతి  కీలక పాత్రలో  నటిస్తుంది. ఈసినిమా తో  13ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. కాగా  ఈచిత్రంలో మహేష్  ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండగా  ఆయనకు  జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న  హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.   ఈచిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.  
 
 
ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి12 న  విడుదలకానుంది. వరుస  హిట్స్ తో అనిల్  రావిపూడి  మహేష్ బాబు  ఫుల్  ఫామ్ లో ఉండడం తో  ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా  పై భారీ అంచనాలునెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: