అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ విజయ్‌దేవరకొండ టాలీవుడ్‌లో బిజీగా గడుపుతున్న స్టార్లలో ఒకరు. ప్రస్తుతం ఆయన నటించిన డియర్‌ కామ్రేడ్‌ సినిమా విడుద‌లైంది.  అయితే ఇవి కాకుండా ఈ క్రేజీ హీరో మరో క్రేజీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నాడట. ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ యంగ్ హీరో తాజాగా ఓ వివాదాస్పద బయోగ్రాఫికల్‌ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌ కాంట్రవర్షియల్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న‌ బయోపిక్‌ తలైవి.

 

జయలలిత రాజకీయ జీవితమంత వివాదాలమయ‌మే. ఆమె రాజకీయ అరంగేట్రం, సీఎం పదవి చేపట్టడం, తరువాత‌ పరిణామాలు, శశికళ‌తో ఆమె సాన్నిహిత్యం లాంటి ఎన్నో వివాదాస్పద అంశాలు ఆమె జీవితంలో ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సినీ నటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రల కనిపించనున్నాడట.

జయలలిత జీవితంలో తెలుగు హీరో శోభన్‌బాబుది కీలక పాత్ర. ఒకప్పుడు వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అంతేకాదు వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా అప్పట్లో చాలా గట్టిగానే జరిగింది. అయితే తరువాత కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు దూరమయ్యారు. ఇప్పుడు జయలలిత బయోపిక్‌లో విజయ్‌ దేవరకొండ శోభన్‌బాబు పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈసినిమాలో వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించి పెద్దగా కాంట్రవర్సీలకు పోయే అవకాశం లేదు. అందుకే విజయ్‌ కూడా ఈ పాత్రకు ఓకె చెప్పి ఉంటాడని తెలుస్తోంది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తున్న ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్‌ స్వామి, కరుణానిథి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌లు నటిస్తున్నారు. ఇక ఇంత‌కీ ఈ చిత్రం విజ‌య్‌కి ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుందో తెర మీద చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: